ఐదు జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ ఐదు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లా అధ్యక్షులుగా సీఆర్ గౌడ, యాదగిరి జిల్లాకు బసిరెడ్డి, కొడుగుకు ధర్మజ ఉత్తప్ప, తుమకూరు చంద్రశేఖర్గౌడ, హాసన్ జిల్లాకు ఈహెచ్ లక్ష్మణ్లను నియమించారు. వెంటనే ఉత్తర్వులు అమలులోకి రానున్నాయని ప్రకటించారు. ఐదు జిల్లాల అధ్యక్షుల మార్పుతో మిగిలిన జిల్లాల అధ్యక్షులకు ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోననే భయం వెంటాడుతోంది. కొత్త అధ్యక్షుల నియామకం పూర్తిగా డీకే శివకుమార్ సూచనలతోనే జరిగినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/