గిరిజన సమస్యలపై వికారాబాద్ లో 23న సదస్సు
మాజీ ఎంపీ రవీందర్ నాయక్ వెల్లడి
Hyderabad: రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ , పోడు భూముల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై వికారాబాద్లో టైబల్ ఫెడరేషన్ 23న సభను నిర్వహించబోతున్నది.
తండాలను పంచాయతీలుగా, రెవెన్యూ గ్రామాలుగా గుర్తిస్తామన్న సీఎం కేసీఆర్ మాట తప్పారని అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ రవీందర్ నాయక్ విమర్శించారు.
అర్హులైన గిరిజన రైతులకు మూడెకరాల భూమి , డబుల్ బెడ్రూం ఇళ్లు, జిల్లాకో గిరిజన భవనం, ఐటీడీఓ ఏర్పాటు, ప్రత్యేక ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, గిరిజన సమరయోధులను పాఠ్యాంశాల్లో చేర్చాలని, గిరిజన మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/