గాంధీనగర్ లో సంపూర్ణ లాక్ డౌన్
అధికారులు వెల్లడి
Gandhi Nagar (Gujarat): దేశంలో అత్యధిక కరోనా కేసులు నవెూదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్ రెండో స్థానంలో ఉంది .
దీంతో రాష్ట్రంలో కరోనా కట్టడికి గాంధీనగర్లో నేటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గాంధీనగర్ తో పాటు కలోల్ మున్సిపాలిటీలో కూడా నేటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
రాష్ట్రంలోని అహ్మదాబాద్, సూరత్లో ఇప్పటికే పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి విదితమే.
గుజరాత్లో నవెూదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా అహ్మదాబాద్, సూరత్, గాంధీనగర్లోనే ఉంటున్నాయి.
కొత్తగా గాంధీనగర్, కలోల్ మున్సిపాలిటీల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నవెూదవుతుండటంతో ఈ నెల 17 వరకు లాకడౌన్ పూర్తిస్థాయిలో విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం :https://www.vaartha.com/specials/health/