అగ్గిపెట్టె గుర్తుపై టీజేఎస్ పోటీ చేస్తుంది
ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మున్సిపల్ ఎన్నికల ప్రణాళికలను విడుదల చేశారు. అగ్గిపెట్టె గుర్తుపై టీజేఎస్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకుందని కోదండరాం అన్నారు. ప్రజాసమస్యలే ప్రధాన ఎజెండాగామున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్లాక్ష్యానికి గురయిన మున్సిపాలిటీలను తిరిగి పునరుద్ధరించాలని ఆకాంక్షించారు. ప్రజలను ఓట్లు అడిగే పార్టీలు వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పాలని కోదందరాం ప్రశ్నించారు. కలిసి వచ్చే పార్టీలతో కలిసి హైదరాబాద్లో బహిరంగ సభ పెడతామని కోదండరాం తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/