తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి వార్త

గత కొద్దీ రోజులుగా పెరుగుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫిబ్రవరి నెల నుండే ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఇప్పుడే ఇలా ఉంటె ఏప్రిల్ , మే నెలలో ఇంకెలా ఉంటాయో అని ఖంగారుపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. మార్చి 16 నుండి తెలంగాణ లోని పలు జిల్లాలో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించింది.

దీనికి తోడు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఈ నెల 16 తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.