బాబు జగ్జీవన్‌ రామ్ కి సీఎం జగన్‌ నివాళులు

అమరావతి: ఈరోజు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ 115వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు. ‘‘స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధుడు, జ‌నం కోస‌మే త‌న జీవితాన్ని అంకితం చేసిన నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ గారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్ర‌ధానిగా ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. నేడు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/