సిఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం
దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మిస్తామని ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ పలు అభివృద్ధి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీని నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం నోయిడాలో అనువైన స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. గౌతం బుద్ధనగర్ జిల్లాలో దేశంలోనే అతిపెద్ద, అందమైన ఫిలింసిటీని నిర్మించనున్నట్టు చెప్పారు. దీని నిర్మాణం కోసం నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్ప్రే వే సమీపంలో స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే, మీరట్లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టును మార్చి 2025లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/