కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సిఎం రమేశ్‌ భేటి

ఏపీ రాజకీయ పరిస్థితులు, జగన్ పాలనపై వివరించిన ఎంపీ

CM-ramesh

న్యూఢిల్లీః బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలోని అమిత్ షా కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జగన్ పాలన గురించి అమిషాకు సీఎం రమేష్ వివరించినట్టు సమాచారం. ఏపీలో బిజెపి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై అమిత్ షా ఆరా తీసినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఏపీలో బలపడేందుకు బిజెపి యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖకు వచ్చినప్పుడు కూడా పార్టీ శ్రేణులకు ప్రధాని మోడీ ఇదే దిశగా మార్గ నిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాలను ఉద్ధృతం చేయాలని, లేనిపక్షంలో అవకాశాన్ని ఇతర పార్టీలు అందిపుచ్చుకుంటాయని మోడీ అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/