రేపు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం

CM KCR's Maharashtra tour canceled
CM KCR

హైదరాబాద్ః సిఎం కెసిఆర్‌ రేపు మధ్యాహ్నం తమ పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. 18 నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఉభ‌య‌స‌భ‌ల్లో టీఆర్ఎస్ పార్టీ అనుస‌రించాల్సిన విధివిధానాల‌పై కేసీఆర్.. ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాడాల‌ని ఎంపీల‌కు కేసీఆర్ పిలుపు ఇవ్వ‌నున్నారు. ముఖ్యంగా తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తెలంగాణ ప్రజా వ్యతిరేక విధానాలను దనుమాడుతూ పార్లమెంటు ఉభయసభల్లో తీవ్ర నిరసనను ప్రకటిస్తూ, పార్లమెంటు వేదికగా పోరాటానికి పూనుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఆర్ధికంగా క్రమశిక్షణను పాటిస్తూ అనతి కాలంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి, ఆర్థింకగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం కుటిల ప్రయత్నాలు చేస్తుండడం పట్ల తెలంగాణ ప్రజా ఆకాంక్షలను అద్దం పడుతూ ఉభయ సభల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/