సమక్మ-సారలమ్మను దర్శించుకున్న సిఎం కెసిఆర్
మేడారం: మేడారంలో గద్దెలపై కొలువైన వన దేవతలను సిఎం కెసిఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ వన దేవతలకు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. సీఎం వెంట మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ ఉన్నారు. కేసీఆర్ రాకతో తాడ్వాయి అటవీ ప్రాంతంలో పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. కాగా, ప్రస్తుతం గద్దెలపై కొలువుదీరిన సమ్మక్కసారలమ్మ రేపు తిరిగి వన ప్రవేశం చేస్తారు. దాంతో ఈ ఏడాది మేడారం జాతర ముగుస్తుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/