వాసాలమర్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌

యాదాద్రి భువ‌న‌గిరి : సీఎం కెసిఆర్ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా దత్తత గ్రామం తుర్క‌పల్లి మండ‌లం‌లోని వాసా‌ల‌మ‌ర్రిలో పర్యటిస్తున్నారు. తొలుత ద‌ళిత వాడ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆ వాడ‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం కేసీఆర్.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌తో పాటు ద‌ళితుల‌ స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ద‌ళిత‌వాడ‌లో ప‌ర్య‌ట‌న ముగిసిన అనంత‌రం.. గ్రామ‌మంతా క‌లియ తిరుగుతూ పారిశుద్ధ్య చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించ‌నున్నారు.

అనం‌తరం రైతు వేదిక భవ‌నంలో ఏర్పా‌టు‌చే‌సిన సమా‌వే‌శంలో గ్రామా‌భి‌వృ‌ద్ధిపై గ్రామ‌స్థు‌లతో చర్చిం‌చ‌ను‌న్నారు. గత పర్య‌టన సంద‌ర్భంగా తాను చేసిన పలు సూచ‌నల అమ‌లు‌తీ‌రుపై ఈ సంద‌ర్భంగా సీఎం సమీ‌క్షిం‌చ‌నున్నారు. తదు‌పరి చేప‌ట్టా‌ల్సిన కార్యా‌చ‌ర‌ణపై ప్రజా‌ప్ర‌తి‌ని‌ధులు, అధి‌కా‌రులు, ప్రజ‌లకు దిశా‌ని‌ర్దేశం చేస్తారు. కాగా, వాసాలమర్రికి సీఎం కేసీఆర్‌ రావడం ఇది రెండోసారి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/