రేపు యాదాద్రికి సీఎం కెసిఆర్!
హైదరాబాద్: సీఎం కెసిఆర్ గురువారం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నట్టు తెలిసింది. ఆలయ పునర్నిర్మాణ పనులను కెసిఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించే అవకాశం ఉన్నది. ప్రధాన ఆలయంతోపాటు క్యూలైన్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట, ప్రెసిడెన్షియల్ సూట్ పనులను పరిశీలించనున్నట్టు సమాచారం. అక్కడే ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిపై సీఎం కెసిఆర్ సమీక్షిస్తారని సమాచారం.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/