నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం కెసిఆర్ పర్యటన
హైదరాబాద్: సీఎం కెసిఆర్ నేడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం నారాయణఖేడ్ పట్టణానికి చేరుకొంటారు. రూ.4,427 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం హైదరాబాద్కు బయలుదేరుతారు.
కాగా, సంగారెడ్డి జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేక సాగు, తాగు నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. మల్లన్నసాగర్ నుంచి సింగూరుకు జలాలను తరలించే ప్రక్రియను చేపట్టారు. అక్కడి నుంచి సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు నీటిని అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర పథకాలను మంజూరు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/