నేడు గవర్నర్‌తో సిఎం కెసిఆర్‌ భేటి

కరోనా కట్టడి,వివిధ అంశాలపై చర్చలు

cm- governor
cm- governor

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో సిఎం కెసిఆర్‌ ఈరోజు సమావేశం కానున్నారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. కరోనా నివారణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, చికిత్సకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేసిందన్న అంశాలపై గవర్నర్‌కు సిఎం వివరించనున్నారు. అలాగే మరో రెండు, మూడు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు. సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి కొత్త డిజైన్‌పై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో రెండు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయ్యాయి. వాటి భర్తీ విషయంపై అభ్యర్థుల పేర్లు కూడా గవర్నర్‌కు ముఖ్యమంత్రి సిఫార్స్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఈ అంశాలన్నింటిపై గవర్నర్‌తో సిఎం కెసిఆర్‌ చర్చించనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/