నేడు సిఎం కెసిఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం
హైదరాబాద్ః నేడు సిఎం కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నది. ఇదే సమావేశంలో మంత్రివర్గ సిఫార్సుపై గవర్నర్ ఆమోదించే రెండు ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం. ఇండ్లు, ఇండ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు, అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీపై చర్చించే అవకాశం ఉన్నది.