ఉద్యోగ సంఘాలతో ముగిసిన సిఎం భేటి

TRS supports Bharat Bandh: KCR
TS CM KCR

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ఉద్యోగ సంఘాలతో భేటి ముగిసింది. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ భేటీకి దాదాపు 200 మంది ఉద్యోగులు, అధికారులు హాజరయ్యారు. పీఆర్సీ, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై సమావేశంలో చర్చించినట్లుగా సమాచారం. పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలన్నీ ఫిబ్రవరి చివరికల్లా పరిష్కరించాలని సిఎం కెసిఆర్‌ ఇప్పటికే అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ ఉద్యోగ సంఘాల డైరీలను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఉన్నతాధికారులు, టీజీవో, టీఎన్‌జీవో, సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/