నేడు ధరణి పోర్టుల్ రూపకప్పనపై సిఎం సమీక్ష
హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఈరోజు మధ్యాహ్నం ధరణి పోర్టల్ రూపకల్పనపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూశాఖకు సంబంధించి ధరణి పోర్టల్ను కొత్తగా రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో పోర్టల్లో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం అమలు, విధివిధానాలపై సమావేశంలో సిఎం అధికారులతో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. పట్టణ, పురపాలక పన్నురికార్డులను అనుసంధానం చేసే అంశంపైనా చర్చించనున్నట్లు సమాచారం. భూదస్త్రాల నిర్వహణపై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/