మరికాసేపట్లో మునుగోడు బయల్దేరనున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్ః సిఎం కెసిఆర్ మరికాసేపట్లో మునుగోడుకు బయల్దేరానున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభకు సర్వం సిద్ధమయింది. సభా ప్రాంగణంతోపాటు మునుగోడు అంతా గులాబీమయం అయింది. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు. సభావేదికగా సిఎం కెసిఆర్ మునుగోడు ఉపఎన్నికకు సమరశంఖం పూరించనున్నారు.
ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నది. సిఎం కెసిఆర్ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి బయల్దేరనున్నారు. ప్రజా దీవెన సభకు సిఎం కెసిఆర్ రోడ్డుమార్గంలో వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/