శాఖలు, జిల్లాల వారీగా ఉద్యోగాల ఖాళీల వివరాలు..

cm kcr speech in assembly

హైదరాబాద్: సీఎం కెసిఆర్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి.

జోన్ల వివరాలు:

జోన్‌-1 కాళేశ్వరం: ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు. జోన్‌-2 బాసర: ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల. జోన్‌-3 సిరిసిల్ల: కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి. జోన్‌-4 భద్రాద్రి: కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ. జోన్‌-5 యాదాద్రి: సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగామ. జోన్‌-6 చార్మినార్‌: మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌. జోన్‌-7 జోగులాంబ: మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌ కర్నూలు

రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..
గ్రూప్‌ 1- 503, గ్రూప్‌ 2- 582, గ్రూప్‌ 3 – 1,373, గ్రూప్‌ 4- 9168 పోస్టులు ఉన్నాయి.

క్యాడర్ వారీగా ఖాళీలు..


జిల్లాల్లాలో- 39,829, జోన్లలో- 18,866, మల్టీజోనల్‌ పోస్టులు- 13,170, సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో- 8,147 ఉన్నాయి.

జిల్లాల వారీగా ఖాళీలు..


హైదరాబాద్ – 5,268, నిజామాబాద్- 1,976, మేడ్చల్ మల్కాజ్‌గిరి- 1,769, రంగారెడ్డి- 1,561, కరీంనగర్- 1,465,
నల్లగొండ- 1,398,కామారెడ్డి- 1,340, ఖమ్మం- 1,340, భద్రాద్రి కొత్తగూడెం- 1,316, నాగర్‌కర్నూల్- 1,257,సంగారెడ్డి- 1,243, మహబూబ్‌నగర్- 1,213, ఆదిలాబాద్- 1,193, సిద్దిపేట- 1,178, మహబూబాబాద్- 1,172, హనుమకొండ- 1,157, మెదక్- 1,149, జగిత్యాల- 1,063, మంచిర్యాల- 1,025, యాదాద్రి భువనగిరి- 1,010, జయశంకర్ భూపాలపల్లి- 918, నిర్మల్- 876, వరంగల్- 842, కుమ్రం భీం ఆసీఫాబాద్- 825, పెద్దపల్లి- 800, జనగాం- 760, నారాయణపేట్- 741, వికారాబాద్- 738, సూర్యాపేట- 719, ములుగు- 696, జోగులాంబ గద్వాల- 662, రాజన్న సిరిసిల్లా- 601, వనపర్తి- 556 పోస్టులు ఉన్నాయి.

జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..

జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు.. కాళేశ్వరం జోన్‌లో- 1,630, బాసర జోన్‌- 2,328, రాజన్న జోన్‌- 2,403, భద్రాద్రి జోన్‌- 2,858, యాదాద్రి జోన్‌- 2,160, చార్మినార్ జోన్‌- 5,297, జోగులాంబ జోన్‌- 2,190 పోస్టులు ఉన్నాయి. ఇక, మల్టీజోన్ 1- 6,800 మల్టీజోన్ 2- 6,370 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..
హోం శాఖ- 18,334, సెకండరీ ఎడ్యుకేషన్- 13,086, హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్- 12,755, ఉన్నతవిద్యా శాఖలో – 7,878, బీసీల సంక్షేమం- 4,311, రెవెన్యూ శాఖ- 3,560,ఎస్సీ వెల్ఫేర్‌ శాఖ- 2,879, నీటిపారుదల శాఖ- 2,692, ఎస్టీ వెల్ఫేర్- 2,399, మైనారిటీస్ వెల్ఫేర్- 1,825, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ- 1,598, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455, లేబర్, ఎంప్లాయీమెంట్- 1,221, ఆర్థిక శాఖ- 1,146, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్- 859, అగ్రికల్చర్, కో-ఆపరేషన్- 801, రవాణా, రోడ్లు, భవనాల శాఖ- 563, న్యాయశాఖ- 386, పశుపోషణ, మత్స్య విభాగం- 353, జనరల్ అడ్మినిస్ట్రేషన్- 343, ఇండస్ట్రీస్, కామర్స్- 233, యూత్, టూరిజం, కల్చర్- 184, ప్లానింగ్- 136, ఫుడ్, సివిల్ సప్లయిస్- 106, లెజిస్లేచర్- 25, ఎనర్జీ- 16 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/