డిసెంబరు 27 నుంచి మరో విడత రైతుబంధు

రూ.7,300 కోట్లు విడుదల చేయాలంటూ సిఎం ఆదేశాలు

Farmers
Farmers

హైదరాబాద్‌: తెలంగాణో రెండో విడత రైతుబంధు సాయానికి సన్నాహాలు చేయాలని సిఎం కెసిఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం అందించనున్నట్టు సిఎం కెసిఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు లబ్ది పొందేలా చూడాలని, రైతుల ఖాతాలోకే నేరుగా డబ్బు జమ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ రెండో విడత రైతుబంధు పంపిణీ కోసం రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

మొదట తక్కువ విస్తీర్ణంలో భూమి కలిగిన రైతులకు రైతుబంధు అందజేయాలని, ఆ తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో భూమి కలిగిన రైతులకు రైతుబంధు అందించాలని సూచించారు. ఇదంతా 10 రోజుల్లో ముగియాలని స్పష్టం చేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/