రేపు ధరణి పోర్టుల్ పై సిఎం కెసిఆర్ సమీక్ష
హైదరాబాద్: సిఎం కెసిఆర్ రేపు ధరణి పోర్టల్పై సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ రూపకల్పనపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ పోర్టల్ రూపకల్పనకు సమగ్ర సమాచారంతో రావాలని అధికారులను సిఎం ఆదేశించారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ధరణి పోర్టల్ రూపకల్పన జరగాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/