చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి సీఎం కెసిఆర్ ఫోన్ చేశారు. ఇటీవల మెగాస్టార్ కు కరోనా సోకడంతో ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య విషయాలను అడిగితెలుసుకున్నారు. కొవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. కాగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని చిరంజీవి నిన్న (జనవరి 26) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నానని, తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో ముందుకు వస్తానని పేర్కొన్నారు.

కాగా, థర్డ్ వేవ్ లో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న చిరంజీవితో పాటు మరో ప్రముఖ నటుడు శ్రీకాంత్ కరోనా బారిన పడ్దారు. అంతకుముందు మహేశ్ బాబు, థమన్, మంచులక్ష్మి, విశ్వక్ సేన్, యానీమాస్టర్ తదితరులు కరోనాకు గురయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/