రుద్రాక్ష మొక్క నాటిన సిఎం కెసిఆర్‌

కెసిఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం

హైదరాబాద్‌: నేడు సిఎం కెసిఆర్‌ జన్మదినం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైంది. టిఆర్‌ఎస్‌ ఎంపీ సంతోశ్ కుమార్ వినతి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు ఇందులో భాగస్వాములయ్యాయి. సంతోశ్ కుమార్ వినతి మేరకు ముఖ్యమంత్రి కెసిఆ కూడా కోటి వృక్షార్చనలో స్వయంగా పాల్గొన్నారు. రుద్రాక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన పట్ల సిఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్ ను అభినందించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/