ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సిఎం కెసిఆర్‌ దంపతులు

కాళేశ్వరం: కాళేశ్వరంలో పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్‌ కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సిఎం కెసిఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి సిఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు దగ్గరుండి సిఎం దంపతులతో స్వామివారికి అభిషేకం చేయించి, ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.


కాగా సిఎం పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనం తరువాత మధ్యాహ్నం సిఎం కెసిఆర్‌ హెలికాప్టర్‌లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. అటు తరువాత లక్ష్మీ బరాజ్‌కు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగికి సాగునీటి విడుదల తదితర అంశాలపై అధికారులతో ఆయన మాట్లాడనున్నారు. సిఎం పర్యటలనో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గుంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/