రైతుల‌కు 100 శాతం రుణ‌మాఫీ..సీఎం కెసిఆర్

హైదరాబాద్: నేడు అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశంలో ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడారు. రాష్ర్టంలోని రైతుల‌కు రుణ‌మాఫీ వంద‌కు 100 శాతం చేసి తీరుతామ‌ని సీఎం కెసిఆర్ 25 వేల వ‌ర‌కు ఎంత మందికి రుణాలు ఉండేనో… వారికి గ‌త సంవ‌త్స‌రం మాఫీ చేశాం. మిగ‌తా వారి విష‌యంలో రేపు ఆర్థిక మంత్రి ప్ర‌క‌ట‌న చేస్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రుణ‌మాఫీ చేయ‌లేదు. పోడు భూముల విష‌యంలో కూడా ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంద‌న్నారు. 60 ఏండ్ల పాపాన్ని స‌మ‌గ్రంగా ప‌రిశీలించి ప‌రిష్క‌రించుకుంటాం. పోడు భూముల విష‌యంలో పీఠ‌ముడి ఉంద‌న్నారు.

కాంగ్రెస్ హ‌యాంలో నీటి తిరువా ముక్కుపిండి వ‌సూలు చేశారు. తెలంగాణ రాష్ర్టంలో నీటి తిరువాను ఎత్తేశామ‌న్నారు. ఉచిత క‌రెంట్‌ను రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. కానీ క‌రెంట్ వ‌చ్చేది కాదు.. ఉత్త క‌రెంట్ కింద‌నే పోయేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ర్టంలో ఉచిత 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. హై క్వాలిటీ ప‌వ‌ర్ సప్ల‌యి అవుతోంది. వ‌ర‌ద కాల్వ మీద వంద‌ల‌, వేల మోటార్ల‌ను పెట్టుకునే వారు. కాక‌తీయ కాల్వ మీద కూడా వేల మోటార్లు పెట్టుకున్న‌ప్ప‌టికీ.. వాటి వ‌ద్ద‌కు వెల్లొద్ద‌ని క‌రెంట్ అధికారుల‌కు తాను సూచించాన‌ని చెప్పారు. రైతుల విష‌యంలో చాలా లిబ‌ర‌ల్‌గా ఉన్నామ‌ని చెప్పారు. యాసంగిలో 52 ల‌క్ష‌ల ఎక‌రాల సాగు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ప్ర‌సంగం విష‌యంలో చాలా విష‌యాలు వ‌స్తాయ‌న్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/