బిపిఆర్ విఠల్ మృతికి సిఎం సంతాపం
హైదరాబాద్: సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రముఖ ఆర్ధికవేత్త బిపిఆర్ విఠల్ మృతి చెందారు. అయితే ఆయన మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. విఠల్ కుటుంబానికి సిఎం సానుభూతి వ్యక్తంచేశారు. ఆయన చేసిన సేవలను కెసిఆర్ స్మరించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆయన ఆర్ధిక, ప్రణాళికా కార్యదర్శిగా పనిచేశారు. ఏపీ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు వైస్ఛైర్మన్గా కూడా ఆయన సేవలందించారని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్ (ఐఎంఎఫ్), పదో ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా కూడా విఠల్ సేవలందించారని సిఎం కెసిఆర్ అన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/