నేడు ప్రజాప్రతినిధులతో సిఎం కెసిఆర్ భేటి
హైదరాబాద్: సిఎం కెసిఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 20 జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలతో మధ్యాహ్నం 12 గంటలకు సిఎం కెసిఆర్ భేటీ జరుగనుంది. సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఎన్.రామచంద్రరావు కొనసాగుతున్నారు. వీరి పదవీకాలం త్వరలో ముగియనుండటంతో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ సైతం మొదలైంది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబర్ 6 వరకు కొనసాగునుంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/