టిఆర్‌ఎస్‌ ఎంపిలతో సమావేశమైన సిఎం కెసిఆర్‌

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ప్రగతి భవన్‌లో టిఆర్‌ఎస్‌ ఎంపిలతో సమావేశమయ్యారు. ఈ స‌మావేశానికి టిఆర్‌ఎస్ లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంట్‌లో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఎంపిల‌కు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రం వైఖరి, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల్లో రాష్ట్ర విధానం, జీఎస్టీ విషయంలో కేంద్రం తీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 14 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/