నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కెసిఆర్ భేటీ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో నలుగురు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నిన్న జరిగిన విషయంపై మరోసారి కేసీఆర్కు ఎమ్మెల్యేలు వివరించారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నివేదిక ఆధారంగా బీజేపీ పై స్పందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మధ్యాహ్నం తర్వాత సీన్లోకి కేసీఆర్ ఎంటర్ కానున్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.