ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు బ‌య‌ల్దేరిన సిఎం కెసిఆర్‌

cm kcr

హైదరాబాద్‌ః ప్ర‌త్యేక విమానంలో సిఎం కెసిఆర్‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు బ‌య‌ల్దేరారు. ఉత్త‌రర్‌ప‌దే‌శ్‌‌లోని ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వ్రగామం సైఫయీకి మంగ‌ళ‌వారం మధ్యాహ్నం సీఎం చేరు‌కొం‌టారు. ములాయం పార్థి‌వ‌దే‌హా‌నికి శ్ర‌ద్ధాంజలి ఘటించి నివా‌ళులు అర్పిం‌చ‌ను‌న్నారు. అనంత‌రం ములాయం అంత్య‌క్రి‌యల్లో కెసిఆర్‌తో పాటు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కూడా పాల్గొంటారు.

ములాయం అంత్య‌క్రియ‌లు ముగిసిన అనంత‌రం ఇవాళ సాయంత్రం కెసిఆర్ ఢిల్లీకి చేరుకుంటారు. మూడు, నాలుగు రోజుల పాటు కెసిఆర్ ఢిల్లీలోని మకాం వేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ తీర్మానం చేసిన త‌ర్వాత తొలిసారి కెసిఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు జాతీయ నాయ‌కుల‌తో కెసిఆర్ స‌మావేశం అయ్యే అవ‌కాశం ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/