నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్న సిఎం కెసిఆర్
నర్సంపేటః సిఎం కెసిఆర్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చేరుకుని దెబ్బతిన్న మిర్చి, మామిడి, పంటలను పరిశీలించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఖమ్మం జిల్లాలో కూడా రైతులకు సిఎం కెసిఆర్ ఇదే హామీ ఇచ్చారు. కౌలు రైతులను కూడా ఆదుకోవాలని ఈ సందర్బంగా రైతులకు సిఎం కెసిఆర్ సూచించారు. పెట్టుబడి పెట్టినోళ్లు వాళ్లు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సాయంలో వాళ్లకు కూడా కొంత ఇచ్చి ఆదుకోవాలన్నారు. దీనిపై రైతులను కౌలు రైతులను కలెక్టర్ పిలిచి మాట్లాడతారని చెప్పారు.