‘ధరణ పోర్టల్‌’ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

cm-kcr-inaugurates-dharani-portal

మేడ్చల్‌: సిఎం కెసిఆర్‌ ‘ధరణ పోర్టల్‌’ ను ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఈ పోర్టల్ ను వేదమంత్రోచ్ఛరణ మధ్య సిఎం ప్రారంభించారు. పోర్టల్ ప్రారంభంతో, ఇప్పటి వరకు పుస్తకాలకే పరిమితమైన భూముల వివరాలు ఇకపై ఆన్ లైన్ కాబోతున్నాయి. ఇకపై వ్యవసాయ, వ్యవసాయేతర రికార్డులన్నీ ధరణి పోర్టల్ లో ఉండబోతున్నాయి. ప్లాట్ బుకింగ్ నుంచి పాస్ పుస్తకాల వరకు అన్నీ పోర్టల్ లోనే ఉండనున్నాయి. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ధరణి పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. ఈ పోర్టల్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పోర్టల్ ప్రారంభమైన నేపథ్యంలో నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, మంత్రి మ‌ల్లారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/