ఐటీ టవర్‌కు సిఎం కెసిఆర్‌ శంకుస్థాపన

cm-kcr-siddipet-tour

సిద్దిపేట: సిఎం కెసిఆర్‌ సిద్దిపేట జిల్లాలో పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన దుద్దెడ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేశారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పొన్నాలలో నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభించనున్నారు. కాగా, సిద్దిపెటలో పలు అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేయనున్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలో రైతు వేదికను ప్రారంభించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/