సింగరేణి కార్మికులకు కేసీఆర్ తీపి కబురు

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ తీపి కబురు తెలిపారు. సింగరేణి కార్మికులకు రూ. 60 లక్షల ఉచిత భీమా సౌకర్యం కల్పించినట్లు సింగరేణి డైరెక్టర్ బలరామ్ తెలిపారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదాల్లో ప్రాణనష్టం జరిగితే ఈ బీమా కింద రూ. 60 లక్షలు అందుతాయని , ఉద్యోగులు, కార్మికులు తమ బ్యాంక్ ఖాతాలను ‘కార్పొరేట్ వేతన ఖాతా’గా వెంటనే మార్చుకుంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుందని పేర్కొన్నారు.