రేపు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
పలు కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్: సిఎం కెసిఆర్ రేపు సాయంత్రం 4గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్కుమార్ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ మీటింగ్ లో పలు నూతన అంశాలపై చర్చించనున్నారు. సిఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్ సమావేశాలపై మంత్రివర్గం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలో ప్రభుత్వం చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరునున్నట్లు తెలుస్తోంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/