సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సిఎం
స్వయంగా ఇంటికి వెళ్లి నగదు సాయం అందిస్తానని వెల్లడి
హైదరాబాద్: భారత్,చైనా బలగాలతో సరిహద్దు ఘర్షణల్లో అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సిఎం కెసిఆర్ రూ.5 కోట్ల ఆర్థికసాయం ప్రకటించారు. అంతేకాదు, సంతోష్ బాబు భార్యకు గ్రూప్1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఇక, సంతోష్ బాబుతో పాటు ఆ ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు. తానే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి నగదు సాయం అందజేస్తానని తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/