శారదా పీఠానికి చేరుకున్న సిఎం జగన్‌

నేటి నుంచి శారదా పీఠం వార్షికోత్సవాలు

విశాఖ: సిఎం జగన్‌ విశాఖ శారదా పీఠానికి చేరుకున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో ఉన్న శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు ఈ ఉదయం జగన్, పీఠానికి చేరుకున్నారు. నేటి నుంచి పీఠం వార్షికోత్సవాలు ప్రారంభం కానుండగా, పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, తదుపరి పీఠానికి అధిపతి కానున్న స్వాత్మానందేంద్ర సరస్వతి నేతృత్వంలో ఐదు రోజుల పాటు ఈ వేడుకలు సాగనున్నాయి.

ఈ కార్యక్రమాల తొలి రోజున జగన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. స్వామీజీలతో కలసి గోపూజ, శమీ వృక్ష పూజ చేయనున్న జగన్, ఆపై ప్రారంభం కానున్న రాజశ్యామల యాగంలోను పాల్గొంటారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి 2 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/