పింగళి వెంకయ్య కు నివాళి అర్పించిన సీఎం జగన్
అమరావతి : సీఎం జగన్ భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా సీఎం జగన్ ‘‘భారత జాతీయ పతాక రూపకర్తగా తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన.. పింగళి వెంకయ్య నిత్య స్మరణీయులు. స్వాతంత్ర్య సమరయోధునిగా ఆయన చేసిన సేవలను ఈ దేశం ఎప్పటికీ మరువదు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళి’’ అంటూ ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/