రేపు శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటన

రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

అమరావతి: రేపు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్ పర్యటించబోతున్నారు. ఆయన పర్యటన అధికారికంగా ఖరారయింది. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి జగన్ బయల్దేరుతారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చెన్నేకొత్తపల్లికి బయల్దేరుతారు.

10.50 గంటలకు చెన్నేకొత్తపల్లికి చేరుకుని… 15 నిమిషాల పాటు స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడతారు. ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. పంటల బీమా మెగా చెక్ ను రైతులకు అందించి మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లికి తిరుగుపయనమవుతారు. మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/