నేడు జగనన్న చేదోడు ఆర్థిక సహాయం పంపిణీ

ap-cm-jagan

అమరావతిః నేడు జగనన్న చేదోడు మూడో విడత ఆర్థిక సాయాన్ని సిఎం జగన్‌ విడుదల చేయనున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించే కార్యక్రమంలో 3,30,145 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.330.15 కోట్లను బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. మూడో విడతతో కలిపి ఇప్పటివరకూ రూ.927.39 కోట్లను లబ్ధి చేకూర్చినట్లు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అత్యంత పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయాలద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. గతేడాది అర్హులై ఉండి డబ్బులు రాని వారికి ఈసారి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

కాగా, చిన్న తరహా వ్యాపారుల సంక్షేమార్థం సీఎం జగన్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం జగనన్న చేదోడు. ఇందులో భాగంగా దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక సాయంగా ఏటా రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/