ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలి

వర్షాలు, సహాయక చర్యలపై సిఎం జగన్‌ సమీక్ష

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరాతి: భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపి తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఎం జగన్‌ భారీ వర్షాలు, సహాయక చర్యలపై ఈరోజు మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ..ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్‌ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సిఎం ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు. అదేసమయంలో వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని సిఎం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని అన్నారు. తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలన్న సిఎం జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సుచరిత, బొత్స, సీఎస్‌ నీలంసాహ్ని పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు,అధికారులతో జిల్లాలవారీగా సిఎం సమీక్షించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/