ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలి
కరోనాపై సిఎం జగన్ సమీక్ష
అమరావతి: సిఎం జగన్ ఏపిలో కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడ తప్పులు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘ఎంపానల్ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్డెస్క్ కచ్చితంగా ఉండాలి. రిఫరల్ విధానం చాలా సమర్థవంతంగా ఉండాలి. ప్రతిరోజూ కాల్ సెంటర్లకు మాక్ కాల్ చేసి పనితీరును పరిశీలించాలి. కొత్త వైద్య కాలేజీల నిర్మాణం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజారోగ్య వ్యవస్థను కొత్తగా తీసుకొస్తున్న కాలేజీలు బలోపేతం చేస్తాయని’ సిఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/