జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష

అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎం

అమరావతి: సీఎం జగన్ “జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం” పై నేడు సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ ను అధికారులు ఈ సందర్భంగా సీఎం ముందుకు తీసుకువచ్చారు. ఆ డ్రోన్ ను సీఎం జగన్ ఆసక్తిగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు ఉపయోగిస్తున్నామని, త్వరితగతిన పూర్తి చేసేందుకు మరో 20 డ్రోన్లను కూడా రంగంలోకి దించనున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ భూ హక్కు-భూ రక్ష పథకానికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

.వెబ్ ల్యాండ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.
.ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కాకుండా భౌతిక రికార్డులను కూడా రూపొందించాలి.
.ఈ భౌతిక రికార్డులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండాలి. రికార్డులు ఎవరూ తారుమారు చేయలేని విధంగా ఉండాలి.
.సబ్ డివిజన్ కోసం దరఖాస్తు వచ్చిన వెంటనే సర్వే జరిగేలా ఉండాలి.
.అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలి.
.రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. ఇందులో న్యాయశాఖను కూడా .భాగస్వామిగా చేయాలి. భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చేనాటికి, ఆయా భూములపై వివాదాలు లేకుండా చూడాలి.
.ఏపీలో చేపట్టే భూ సర్వే, రికార్డుల నిర్వహణ దేశానికి దిక్సూచిలా నిలవాలి.
.ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/