మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఫై సీఎం జగన్ ప్రశంసలు

దేశ, విదేశీ కార్పోరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన విశాఖ ‘గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023’ భారీ సక్సెస్ కావడం తో వైస్సార్సీపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ..మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్ లపై ప్రశంసలు కురిపించారు. విశాఖ లో మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్ జరిగింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్ లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు కుదిరాయి. దీంతో 6.09 లక్షల మందికి ఉపాధి లభించబోతుంది.

ఈ క్రమంలో ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసారు. ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం జగన్ సూచించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ ఎస్‌.షన్‌మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్ లను ప్రశంసించారు.