సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సీఎం జగన్
నా ప్రతి అడుగులో గౌతమ్రెడ్డి తోడుగా ఉన్నారు.. సీఎం జగన్
నెల్లూరు : సీఎం జగన్ నెల్లూరులో దివంగత మంత్రి గౌతమ్రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్రెడ్డికి నివాళులు అర్పించి జగన్ మాట్లాడారు. తన ప్రతి అడుగులో గౌతమ్రెడ్డి తోడుగా ఉన్నారని ఆయన చెప్పారు. తనను ఆయన ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారని తెలిపారు. ఆయనను తానే రాజకీయాల్లోకి తీసుకు వచ్చానని చెప్పారు.
ఆరు శాఖలను గౌతమ్రెడ్డి చూసేవారని ఆయన తెలిపారు. ఏపీకి పరిశ్రమలు తీసుకురావాలని గౌతమ్రెడ్డి తపన పడేవారని, పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనేవారని జగన్ చెప్పారు. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానని, సంగం బ్యారేజ్కు మేకపాటి గౌతమ్రెడ్డి బ్యారేజీ పేరు పెడతామని ఆయన తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/