సిఎంలలో జగన్‌కు మూడోస్థానం

ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌ నిర్వహించిన సర్వేలోలో వెల్లడి

CM Jagan
CM Jagan

న్యూఢిల్లీ: సిఎం జగన్‌ దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మూడోస్థానంలో నిలిచారు. జులై 15 నుంచి 27 మధ్య ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ది నేషన్‌ నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాగా.. అత్యంత ప్రజాదరణ కలిగిన సిఎంలలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌ తొమ్మిదో స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(4), ఇతరులు(5), బిహార్‌ సిఎం నితీశ్‌కుమార్‌(6), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే(7), ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌(8), రాజస్తాన్‌ సిఎం అశోక్‌ గెహ్లట్‌(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 19 రాష్ట్రాల్లోని 97 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. జులై 15 నుంచి 27 మధ్య 12,021 మందితో టెలిఫోన్‌ ఇంటర్వ్యూ ద్వారా అభిప్రాయాలు సేరరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/