శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
గుడివాడ: సీఎం జగన్ మహా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న శివరాత్రి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా శివుడికి జగన్ పాలాభిషేకం చేశారు. ప్రత్యేక పూజలతో పాటు యాగశాలలో పూర్ణాహుతిలో సీఎం పాల్గొన్నారు. సీఎం జగన్ వెంట టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని తదితరులు ఉన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/