శారదాపీఠం వేడుకల్లో పాల్గొన్న సిఎం జగన్‌

విశాఖ: సిఎం జగన్‌ విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. అక్కడ ఉన్న రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సిఎం సందర్శించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయ స్వామి ఆలయాలను జగన్‌ దర్శించుకున్నారు. అనంతరం రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ వేదపండితులను సత్కరించారు. ఆ తర్వాత సిఎం శారదాపీఠం వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.


కాగా, నేటి నుంచి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా.. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/