అధికారులకు సిఎం జగన్ ఆదేశాలు
అందరికీ పథకాల ఫలాలు అందేలా చర్యల తీసుకోవాలి..సిఎం
అమరావతి: ఏపి ప్రభుత్వం గత నెలలో వైఎస్ఆర్ వాహన మిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, కాపు నేస్తం పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రభుత్వ పథకాల ద్వారా ఇంకా లబ్ధి పొందాల్సిన వారికి త్వరగా సాయం అందేలా చర్యల తీసుకోవాలని సిఎం జగన్ శుక్రవారం అధికారులను ఆదేశించారు. దీంతో ఇంకా లబ్ధి పొందాల్సిన వారికి పథకాలను వర్తింపజేయాలని సిఎం జగన్ అధికారులకు సూచించారు. గతేడాది డిసెంబర్ తర్వాత మగ్గాలు ఏర్పాటు చేసుకున్న వారికి సైతం నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/