మరికాసేపట్లో కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ: ఏపీ సీఎం జగన్ కాసేపట్లో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ కానున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని కోరడంతో పాటు, కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటుపై కేంద్రమంత్రితో సీఎం చర్చించనున్నారు. అనంతరం 10:30కు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌తో కూడా సీఎం జగన్‌ భేటీ కానున్నారు.

కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌.. రాత్రి వరకు సమావేశాలతో బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవ్‌దేకర్‌లతో సమావేశమయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/